ప్రైవేటు ఆర్దిక సంస్థలు సాదారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయని అంటారు. అయినా ఆ సంస్థలలో కూడా భారీ చోరీలు జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే.తమిళనాడు లోని హో సూరులో భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్లో దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్ తెలిపారు. పట్టపగలే ఇలా చోరీ జరగడం సినిమాటిక్ గా ఉంది. tags : gold