జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ ను పేరు పెట్టి పిలుస్తారట. జగన్ రెడ్డి సి.ఎమ్.లా మాట్లాడితే ముఖ్యమంత్రి అని పిలుస్తానని, ఆయన కొందరి సిఎమ్.లా ప్రవర్తిస్తే పేరు పెట్టి పిలుస్తానని ఆయన అంటున్నారు. కడప జిల్లా కోడూరు లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ప్రత్యేక హోదాపై ప్రధానిని అడిగే ధైర్యం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఉందా అని ఆయన అన్నారు. రైతు సమస్యలపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు.భారతీ సిమెంట్ పరిశ్రమపై ఉన్న శ్రద్ద కడప స్టీల్ ప్లాంట్ పై లేదని ఆయన ఆరోపించారు. రాయలసీమ ఫ్యాక్షన్ సీమ కాదని, చదువుల తల్లి సీమని అని ఆయన ఆయన అన్నారు. ఆశయం కోసం పనిచేసేవారికి గెలుపు ఓటములతో సంబందం లేదని ఆయన అన్నారు. tags : pawankalyan