కాంగ్రెస్ పార్టీ ఆయా వ్యవస్థలపై బూటకపు ప్రచారం చేస్తోందని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి అన్నారు. ప్రదానిపై వ్యక్తిగత ద్వేషంతో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ రాఫెల్ డీల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఫెయిలైన విద్యార్ధి నిత్యం క్లాస్ టాపర్పై ద్వేషం వెళ్లగక్కుతాడని రాహుల్పై వ్యంగ్యాస్త్రం సంధించారు.వ్యవస్ధలను కాపాడతామంటూ ముందుకొస్తున్న విధ్వంసకుల నుంచి వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ, న్యాయవ్యవస్ధ, సీబీఐల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎంతలా తలదూర్చాయో తెలుసుకోవాలని జైట్లీ ఫేస్బుక్ పోస్ట్లో కాంగ్రెస్కు చురకలు వేశారు.
విపక్ష నేతలు మొసలికన్నీరు కారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి వారసత్వ నేతల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. tags : jaitley