AP Political website
 
 
 
New website www.ap24x7news.com launched
Share |

మిత్రులందరికి మనవి.ఇంతకాలం గా రాజకీయ విశ్లేషణలు,విశేషాలను ఈ వెబ్ సైట్ లో ఇస్తూ వచ్చాను.ఇకపై దీనిలో కేవలం వార్త, దానికింద వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం చేస్తాను. అందులో మీ అబిప్రయాలు తెలియచేయవచ్చు. విశ్లేషణలు ,ఇతర విశేషాలను ఇకపై ap24x7news.com website లో చూడగలరు. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ ను ఆదరించిన విధంగానే ఈ కొత్త వెబ్ సైట్ ను కూడా ఆదరించగలరని మనవి చేస్తున్నాను.కొత్త వెబ్ సైట్ లో రాజకీయ,సినిమా,జాతీయ,అంతర్జాతీయ,క్రీడ తదితర వివిధ విభాగాలకు సంబంధించిన వార్తలు విశేషాలు,విశ్లేషణలు ఉంటాయి. వాటితో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమైన వెబ్ సైట్ లతో పోటీపడి బ్రేకింగ్ వార్తలు కూడా ఇవ్వడం జరుగుతుంది.దయచేసి ఒకసారి సందర్శించగలరు.

tags : new website,launched

 
 
 
 

పొరుగు రాష్ట్రమైన కర్నాటక ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కొత్త ఆశలు రేకిత్తించినట్లు కనిపిస్తుంది. నిజంగానే వారికి ఆశలు కలిగినా,లేకున్నా, అలా కనిపించడానికి ముఖ్య పార్టీల నేతలంతా శాయశక్తులా కృషి చేశారనే చెప్పాలి.ఇక అక్కడ ప్రచారం చేసి వచ్చిన కాంగ్రెస్ నేతలకైతే ఇదంతా తమవల్లేనన్న సంతోషం కూడా ఎక్కువగానే ఉంది.తప్పులేదు. నిజమే.కాంగ్రెస్ పార్టీ పరాజయ పరంపరలో పడిపోతుందన్న భావన ఉన్న తరుణంలో ఒక రాష్ట్రంలో , అందులోను జాతీయ స్థాయిలో ప్రత్యర్ది అయిన బిజెపి పాలిత రాష్ట్రాన్ని గెలుచుకోవడం నైతికంగా కాంగ్రెస్ కు పెద్ద ఉపశమనం కలిగించే అంశమే.దాని ని స్పూర్తిగా తీసుకుని ఆంద్రప్రదేశ్ లో కూడా గెలుస్తామని అనడం లో కూడా తప్పు పట్టనవసరం లేదు. కాకపోతే అక్కడ పరిస్థితులు , ఇక్కడ పరిస్థితులు ఒకలా ఉన్నాయా అన్నది ప్రశ్న.ఇక్కడ ఒక పోలిక కనిపిస్తుంది. కర్నాటకలో బిజెపిలో చీలికలు, లుకలుకలు వచ్చినట్లుగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ లో చీలిక వచ్చింది.అక్కడ చీలిక బిజెపిని ఓడించేదిగాను, కాంగ్రెస్ కు ఉపకరించేదిగాను ఉంటే, ఇక్కడ చీలిక మాత్రం కాంగ్రెస్ ను సవాల్ చేసేదిగా ఉంది.అక్కడ బిజెపి మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కొందరు చెబుతున్నట్లు సిబిఐ భయమో, లేక పార్టీ తనకు అన్యాయం చేసిందన్న భావనతోనో పార్టీని చీల్చి పలు నియోజకవర్గాలలో దెబ్బకొట్టారు. ఆయన పట్టుమని పది స్థానాలలో కూడా గెలవలేకపోయినా ,కాంగ్రెస్ కు మాత్రం శిఖండిలా ఉపయోగపడ్డారు.నిజానికి కాంగ్రెస్ కు అక్కడ ప్రజలలో విశేష ఆదరణ ఉండి ఉంటే, కనీసం నూట ఏభై సీట్లు వచ్చి ఉండాలి. కాని నూట ఇరవై రావడమే కష్టమైపోయింది.విపక్షాలన్నిటికి కలిపి దాదాపు వంద స్థానాలు వస్తే, కాంగ్రెస్ కు నూట ఇరవై స్థానాలు వచ్చాయి.ఓట్ల విభజన వల్ల అక్కడ కాంగ్రెస్ లబ్ది పొందిందన్నది స్పష్టంగానే కనబడుతుంది.మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిస్థితులు వేరు. సమస్యలు వేరు. మామూలు రోజులలో అయితే పొరుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కొంత ఉండవచ్చు.కాని ఇక్కడ అలా లేదు.చిత్రంగా అక్కడ అదికార బిజెపినుంచి చీలిన పార్టీ బలహీనపడిపోతే, ఇక్కడ అదికార కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీ పెద్ద సవాలుగా మారుతున్నట్లు గత ఉప ఎన్నికలలో విజయడంఖా మోగించి సత్తా చాటుకుంది.అక్కడ ఎడ్యూరప్పపై సానుభూతి పవనాలు వీయలేదు. అక్కడ సిబిఐ ఎడ్యూరప్పపై కేసు పెట్టి ఇరవై రోజులు జైలులో పెట్టినా, ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.కాని ఇక్కడ జగన్ కు బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడుతోంది.కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడంతో జగన్ అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.ముఖ్యమంత్రి పదవి చేసిన ఎడ్యూరప్పకు బెయిల్ వస్తుంది.. లక్షా ఎనభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పిన 2 జి కేసులో కేంద్రమంత్రిగా పనిచేసిన రాజాకు బెయిల్ వస్తుంది. కాని ఇక్కడ సిబిఐ చెబుతున్నట్లు నేరాలు జరిగిన సమయంలో కనీసం ఎమ్.పి గా కూడా కాని జగన్ కు బెయిల్ రావడం లేదు. ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రగా ప్రజలు అనుమానిస్తున్నారు.

 
 
For Advertising on this site contact

ads.ksrsite@gmail.com

 

రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.

 
   
     

 
 
copyright © 2011 www.kommineni.info