రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.