AP Political website
 
 
తాజా వార్తా విశ్లేషణలు
 
*చంద్రబాబు నోట ఆ మాటా!
*నేను వాళ్ల గుప్పిట్లో ఉన్నానా!
*సర్వేలను నమ్మకండి-కిరణ్
*దోపిడీ దారులు వస్తారు-బొత్స హెచ్చరిక
*త్వరలో నామినేటెడ్ పోస్టులు
*కిరణ్ కు సలహా
*విజయమ్మ ఆవేదన
*విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి
*నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి
*మీడియాలో వస్తున్నంత గ్యాప్ లేదు
* ఆ ఎమ్.పిలకు ఇప్పుడే జ్ఞానోదయం అయిందా!
*నక్రేకల్ ఎమ్మెల్యే కూడా వేరే దారి పడుతున్నారా!
*కాంగ్రెస్ లో చంద్రబాబు హవా!
*చిత్తశుద్ది ఉంటే అప్పుడే తీసేసేవారు
*జగన్ అరెస్టుకు ఏడాది-ధర్నాలు
*వై.కాంగ్రెస్ జెండాను మార్చుకుంటారా?కిరణ్
*కాంగ్రెస్ లో కార్యకర్తల తీగ తెగింది
*కాంగ్రెస్ గెలవడానికి దామోదర షరతు
*జగన్ ఉగ్రవాది,తరిమికొట్టాలి
*ఆగస్టులో మున్సిపల్ ఎన్నికలు
*చంద్రబాబు ప్రతిజ్ఞ
*పంచాయతీ ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి
*చిరంజీవి బొమ్మ ఎందుకు లేదబ్బా!
*మా మనసు ఎంత బాధపడి ఉంటుంది-షర్మిల
*దర్మాన తిరుగుబాటు చేయనట్లేనా!
*ఇదంతా సి.ఎమ్. అండ ఉండబట్టే!
*పార్టీలోనే ఉండి పోరాడుతా!
*లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంపై అంచనాలు
*టిడిపిలోకి మంత్రి సోదరుడు!
*రఘునందన్ సంచలన ఆరోపణ
*మోడి అద్భుతం ఏమిటో!
*నాడు వై.ఎస్.ఆర్., నేడు విజయమ్మ
*విజయమ్మ కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం
*గోతిలో కాంగ్రెస్ నేతలే పడ్డారు
*ధర్మాన,సబిత ల రాజీనామాల పెండింగ్
*మెట్రో రైల్ ఇసుక కాంట్రాక్టు ఎవరిది
*జగన్ కు రామచంద్రయ్య సలహా
*జైపాల్ మంతనాల ఆంతర్యం ఏమిటో
*మంత్రి పార్ధసారధి వికెట్ ?
*చంద్రబాబు పై విజయమ్మ ధ్వజం
*మిగిలిన మంత్రులకు ఎసరు పెట్టిన బొత్స
*సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా!
*వారు కళంకిత మంత్రులే!
*యుపిఎకి గడ్డుకాలమే-సర్వే ఫలితాలు
* చేవెళ్ల చెల్లెమ్మ రాజకీయ చరిత్రలో మచ్చ
*మంత్రుల రాజీనామాలు-స్పాట్ ఫిక్సింగ్
*బాబు ఢిల్లీ వెళతారు-కాంగ్రెస్ స్పందిస్తుంది
* కాంగ్రెస్ వైపు టిడిపి అడుగులు-కడియం
 
More News from Archives
 
   

రాజీకీయాలలో పార్టీ ఫిరాయింపులపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇది మంచి విషయమే.అదులోను దాడి వీరభద్రరావు వంటి సీనియర్ నేత , మూడు దశాబ్దాలపాటు తెలుగుదేశం పార్టీలో ఉండి, కాంగ్రెస్ ను, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంటి వారిని తీవ్రంగా వ్యతిరేకించి అనూహ్యంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడం ఒకరకంగా సంచలనమే అవుతుంది.సామాన్య జనం ఆశ్చర్యపోయే విషయమే.జగన్ పైన, లేదా వారి కుటుంబీకులపైన దాడి వీరభద్రరావు ఏకంగా ఒకటి,రెండు కాదు పదహారు లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణ చేశారు. బయ్యారం గనులను దోచుకున్నారని ఈయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తనతో ఆ మాటలు చెప్పించిందని దాడి సమర్ధించుకోవచ్చు. పార్టీ విధానం ప్రకారం మాట్లాడానని సర్దిచెప్పుకోవచ్చు.కాని ముందుగా ఆ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం గురించి ఆయన వివరణ ఇచ్చినట్లు లేదు. అలాగే అందుకు క్షమాపణ కూడా కోరినట్లు లేరు.అదే సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా దాడి నుంచి అలాంటి వివరణలు లేదా క్షమాపణలు కోరుకుంటున్నట్లు లేదు. దాడి రావడాన్ని వారు స్వాగతించారు.తమపై ఆరోపణలు చేసినవారే తమపార్టీలోకి రావడంతో తమపై వచ్చిన అబియోగాలకు విలువ లేకుండా పోతుందని ఆ పార్టీ ప్రముఖులు భావించి ఉండవచ్చు.దాడి వీరభద్రరావు ఒక్కరే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదు.డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డికాని , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారు వై.ఎస్.పాలనలో అవినీతికి సంబందించి పుస్తకాలు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారు కూడా జగన్ పార్టీలో ప్రముఖులుగా ఉన్నారు.మైసూరా అయితే అత్యంత కీలకమైన బాద్యతలు నిర్వహిస్తున్నారు

 
 
 
 

పొరుగు రాష్ట్రమైన కర్నాటక ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కొత్త ఆశలు రేకిత్తించినట్లు కనిపిస్తుంది. నిజంగానే వారికి ఆశలు కలిగినా,లేకున్నా, అలా కనిపించడానికి ముఖ్య పార్టీల నేతలంతా శాయశక్తులా కృషి చేశారనే చెప్పాలి.ఇక అక్కడ ప్రచారం చేసి వచ్చిన కాంగ్రెస్ నేతలకైతే ఇదంతా తమవల్లేనన్న సంతోషం కూడా ఎక్కువగానే ఉంది.తప్పులేదు. నిజమే.కాంగ్రెస్ పార్టీ పరాజయ పరంపరలో పడిపోతుందన్న భావన ఉన్న తరుణంలో ఒక రాష్ట్రంలో , అందులోను జాతీయ స్థాయిలో ప్రత్యర్ది అయిన బిజెపి పాలిత రాష్ట్రాన్ని గెలుచుకోవడం నైతికంగా కాంగ్రెస్ కు పెద్ద ఉపశమనం కలిగించే అంశమే.దాని ని స్పూర్తిగా తీసుకుని ఆంద్రప్రదేశ్ లో కూడా గెలుస్తామని అనడం లో కూడా తప్పు పట్టనవసరం లేదు. కాకపోతే అక్కడ పరిస్థితులు , ఇక్కడ పరిస్థితులు ఒకలా ఉన్నాయా అన్నది ప్రశ్న.ఇక్కడ ఒక పోలిక కనిపిస్తుంది. కర్నాటకలో బిజెపిలో చీలికలు, లుకలుకలు వచ్చినట్లుగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ లో చీలిక వచ్చింది.అక్కడ చీలిక బిజెపిని ఓడించేదిగాను, కాంగ్రెస్ కు ఉపకరించేదిగాను ఉంటే, ఇక్కడ చీలిక మాత్రం కాంగ్రెస్ ను సవాల్ చేసేదిగా ఉంది.అక్కడ బిజెపి మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కొందరు చెబుతున్నట్లు సిబిఐ భయమో, లేక పార్టీ తనకు అన్యాయం చేసిందన్న భావనతోనో పార్టీని చీల్చి పలు నియోజకవర్గాలలో దెబ్బకొట్టారు. ఆయన పట్టుమని పది స్థానాలలో కూడా గెలవలేకపోయినా ,కాంగ్రెస్ కు మాత్రం శిఖండిలా ఉపయోగపడ్డారు.నిజానికి కాంగ్రెస్ కు అక్కడ ప్రజలలో విశేష ఆదరణ ఉండి ఉంటే, కనీసం నూట ఏభై సీట్లు వచ్చి ఉండాలి. కాని నూట ఇరవై రావడమే కష్టమైపోయింది.విపక్షాలన్నిటికి కలిపి దాదాపు వంద స్థానాలు వస్తే, కాంగ్రెస్ కు నూట ఇరవై స్థానాలు వచ్చాయి.ఓట్ల విభజన వల్ల అక్కడ కాంగ్రెస్ లబ్ది పొందిందన్నది స్పష్టంగానే కనబడుతుంది.మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిస్థితులు వేరు. సమస్యలు వేరు. మామూలు రోజులలో అయితే పొరుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కొంత ఉండవచ్చు.కాని ఇక్కడ అలా లేదు.చిత్రంగా అక్కడ అదికార బిజెపినుంచి చీలిన పార్టీ బలహీనపడిపోతే, ఇక్కడ అదికార కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీ పెద్ద సవాలుగా మారుతున్నట్లు గత ఉప ఎన్నికలలో విజయడంఖా మోగించి సత్తా చాటుకుంది.అక్కడ ఎడ్యూరప్పపై సానుభూతి పవనాలు వీయలేదు. అక్కడ సిబిఐ ఎడ్యూరప్పపై కేసు పెట్టి ఇరవై రోజులు జైలులో పెట్టినా, ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.కాని ఇక్కడ జగన్ కు బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడుతోంది.కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడంతో జగన్ అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.ముఖ్యమంత్రి పదవి చేసిన ఎడ్యూరప్పకు బెయిల్ వస్తుంది.. లక్షా ఎనభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పిన 2 జి కేసులో కేంద్రమంత్రిగా పనిచేసిన రాజాకు బెయిల్ వస్తుంది. కాని ఇక్కడ సిబిఐ చెబుతున్నట్లు నేరాలు జరిగిన సమయంలో కనీసం ఎమ్.పి గా కూడా కాని జగన్ కు బెయిల్ రావడం లేదు. ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రగా ప్రజలు అనుమానిస్తున్నారు.

 
 
For Advertising on this site contact

ads.ksrsite@gmail.com

 

రాష్ట్రం రెండు నివేదికల కారణంగా రావణాకాష్టంగా మారినట్లు అర్ధమవుతోంది. నమస్తే తెలంగాణ పత్రిక ఒక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం రెండువేల తొమ్మిది డిసెంబరు పందొమ్మిదో తేదీన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య రాసిన ఒక నివేదిక కారణంగా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనను మార్చుకుని డిసెంబరు ఇరవైమూడో తేదీన మరో ప్రకటన చేసిందన్నది ఆ కధన సారాంశం.కేంద్ర హోం మంత్రి చిదంబరానికి రోశయ్య ఒక నివేదిక పంపుతూఆంద్ర,రాయలసీమ ప్రాంతాలలో చిదంబరం ప్రకటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని తెలిపారు. 2.25లక్షల మంది నిరసనలలో పాల్గొన్నారని, ఆంధ్ర,రాయలసీమలలో 1141 ఆందోళనలు జరిగాయని, వీటిలో ర్యాఈలు,ధర్నాలు,ఆమరణ నిరాహార దీక్షలు,రైల్ రకోలు, రాస్తారొకో తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.

 

 
 
copyright © 2011 www.kommineni.info